గెస్ట్గా వచ్చి.. పర్మినెంట్ ఆర్టిస్ట్గా మారి.. జబర్దస్త్ వర్ష ముద్ర!
on May 15, 2021
మోడల్ గా కెరీర్ ఆరంభించిన వర్ష.. బుల్లితెర సీరియల్స్ లో నటించే అవకాశం దక్కించుకుంది. 'అభిషేకం', 'తూర్పు పడమర', 'ప్రేమ ఎంత మధురం' వంటి సీరియల్స్ లో కనిపించింది. అందంతో పాటు యాక్టింగ్ లోనూ రాణించడంతో నటిగా మంచి గుర్తింపు అందుకుంది. ఈ క్రమంలోనే సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. సీరియల్ లో నటిగా బిజీగా ఉన్న సమయంలోనే టాప్ కమెడియన్ హైపర్ ఆది చొరవతో 'జబర్దస్త్' షోలోకి ఎంట్రీ ఇచ్చింది.
కేవలం గెస్ట్ గా వచ్చిన ఆమె.. తన కామెడీ టైమింగ్ తో 'జబర్దస్త్' షోలో పర్మినెంట్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే హైపర్ ఆది స్కిట్ లతో పాటు రాకింగ్ రాకేష్, కెవ్వు కార్తిక్ టీమ్ లలో పని చేస్తోంది. అదే సమయంలో 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోలోనూ చేస్తోంది. 'జబర్దస్త్' లోకి ఎంట్రీ ఇచ్చిన తరువాత వర్ష కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. అలానే ఆ షోలో యంగ్ కమెడియన్ ఇమ్మానుయేల్ తో ప్రేమాయణం సాగిస్తుందనే వార్తలతో మరింత పాపులర్ అయింది.
సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తరచూ తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ గ్లామరస్ ఫోటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్లీవ్ లెస్ టాప్ వేసుకొని గ్లామర్ షో చేస్తూ కనిపించింది. తన నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ యూత్ ను ఆకర్షిస్తోంది. ఈ ఫోటోని చూసిన నెటిజన్లు ఆమె అందాన్ని తెగ పొగిడేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.